ఛాంపియన్స్ ట్రోఫీలో శనివారం మరో రసవత్తర మ్యాచ్ జరగనుంది. కరాచీ వేదికగా నేడు ఆసీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరు జరగనుంది. గ్రూప్ బిలో ఇప్పటికే దక్షణాఫ్రికా ఆప్ఘనిస్తాన్పై గెలిచి ఖాతా తెరిచింది. ఇక నేడు స్మిత్ సేన, బట్లర్ సేన తలపడనుండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.