ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానంపై పలువురు వ్యక్తం చేస్తున్న సందేహాలపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని.. ఇది ఓటరు స్వచ్ఛందమని స్పష్టం చేసింది. ఓటర్లే స్వయంగా ఆధార్ వివరాలు నమోదుకు ఉద్దేశించిన ఫారం 6-బీ స్వచ్ఛందమని పేర్కొంది. ఆధార్ సమర్పించలేదన్న కారణంగా ఓటర్ల జాబితాలో నమోదును తొలగించడం జరగదని పేర్కొంది.