శ్రీశైలం గేట్లు మూసివేత

65చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం 883.70 అడుగుల నీటిమట్టం ఉండగా.. ఇన్‌ఫ్లో 1,43,199 క్యూసెక్కులుగా ఉంది. ఈ ఏడాది జులై 29న శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను రెండేళ్ల తర్వాత అధికారులు ఎత్తారు. ఆగస్టు 12న వాటిని మూసివేశారు. ఆగస్టు 28న గేట్లు తిరిగి తెరిచారు. వరద తగ్గుముఖం పట్టడంతో నేడు మూసివేశారు.