ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనకు 8 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరు అయ్యారు. తనకు జారీ అయిన సమన్లపై స్టే ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. దీనికి రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.