మాజీ మంత్రికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

193182చూసినవారు
మాజీ మంత్రికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
బీహార్ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు.. మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న తేజ్ ప్రతాప్ ఇవాళ పాట్నాలో రాజేంద్ర నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో మహాఘటబంధన్ ప్రభుత్వంలో తేజ్ ప్రతాప్ యాదవ్ పర్యావరణ మంత్రిగా చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్