మోడీ రోడ్‌ షోకు హైకోర్టు అనుమతి

1084చూసినవారు
మోడీ రోడ్‌ షోకు హైకోర్టు అనుమతి
బీజేపీకి మద్రాస్ హైకోర్టులో శుక్రవారం విజయం దక్కింది. ప్రధాని మోడీ రోడ్ షోకు అనుమతి ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కోయంబత్తూరులో మార్చి 18న ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. కొన్ని షరతులతో కోయంబత్తూరులో 4 కి.మీ రోడ్ షోకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్