వైవాహిక జీవితంలో గొడవలు సహజమని, దానిని అందరూ అంగీకరించాలని విద్యావేత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే కాంక్లేవ్లో 'మోడరన్ లవ్' అనే అంశంపై ఆమె మాట్లాడారు. 'ఎప్పుడూ పోట్లాడకపోతే వాళ్లు భార్యాభర్తలు కాదు. ఒకరు కోపంగా ఉంటే, మరొకరు ప్రశాంతంగా ఉండాలి. జీవితంలో ఎవరూ పరిపూర్ణులు కారు. అన్నింటికీ వాటి ప్లస్లు మరియు మైనస్లు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని యువ జంటలు ముందుకు సాగాలని సూచించారు.