తెలంగాణలో ఉపఎన్నికలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్టంలో ఉపఎన్నికలు రానున్నాయని ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్టంలో ఉపఎన్నికలు ఎందుకు వస్తాయని అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాని ఉపఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయని సీఎం రేవంత్ ప్రశ్నించారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తమ పార్టీలోకి చేర్చుకోలేదా అంటూ సీఎం నిలదీశారు.