కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో అందించే ఆహారంపై గత కొన్ని రోజులుగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భోపాల్ నుంచి ఆగ్రాకు వందేభారత్ రైలులో ప్రయాణించిన దంపతులకు ఈ అనుభవం ఎదురైంది. వారు ఆర్డర్ చేసిన ఫుడ్లో బొద్దింక కనిపించింది. దీంతో ఈ విషయాన్ని విదిత్ వర్ష్నే అనే నెటిజన్ ఎక్స్లో పోస్టు చేశారు.