పంటలు ఎండుతున్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి, BRS ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 36 గంటల రైతు భరోసా దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. కాంగ్రెస్ 3నెలల పాలనలో రైతులకు కష్టకాలం దాపురించిందన్నారు. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దీక్షలో పుట్ట మధుకర్, కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.