ఎకరానికి రూ.10వేలు పరిహారం: రేవంత్‌

557చూసినవారు
ఎకరానికి రూ.10వేలు పరిహారం: రేవంత్‌
ఖమ్మంలో వరదల వల్ల నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10వేలు పరిహారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసేందుకు రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో విపత్తు బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. వరదలపై ఖమ్మంలో మంత్రులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. వరదల సమయంలో బురద రాజకీయాలు సరికాదని, ప్రతిపక్షాలు కూడా ప్రజలకు సాయం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్