జూన్ 2 నుంచి టీ20 వరల్డ్కప్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ 2024కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన ఎనిమిది ఒలింపిక్ గోల్డ్మెడల్స్ విజేత, జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్ క్రికెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మా నాన్న క్రికెట్ వీరాభిమాని. జమైకాకి చెందిన నా రక్తంలోనే క్రికెట్ ఉంది. ప్రస్తుతం క్రికెట్లో చాలామంది ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్పప్పటికీ విరాట్ కోహ్లీ అందరికంటే ప్రత్యేకం’ అని బోల్ట్ తెలిపాడు.