మన్యంలో సందర్శకుల సందడి

63చూసినవారు
దసరా సెలవులు కావడంతో ఇవాళ మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో సందడి మొదలైంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందడి కనిపించింది. బొర్రా గుహలు, తాడిగుడ జలపాతాలు, చాపరాయి గెడ్డ, మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, కొత్తపల్లి జలపాతం, తాజంగి రిజర్వాయర్‌, మేఘాల కొండ, లంబసింగి, తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు. కార్తీక మాసం ప్రారంభమైతే మరో 60 రోజుల పాటు పిక్నిక్‌ల సీజన్ కొనసాగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్