సైబర్‌ మోసం.. రూ.9.69 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు

71చూసినవారు
సైబర్‌ మోసం.. రూ.9.69 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు
సైబర్ నేరగాళ్ల మోసానికి సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి బలైపోయాడు. రూ.9.69 లక్షలు బదిలీచేశాడు. ’మీపై ముంబయి కస్టమ్స్‌ కేసు నమోదు చేసిందని, మీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతా మనీలాండరింగ్‌ కేసుకు లింకై ఉంది‘ అని పలుమార్లు ఫోన్లు చేసి నమ్మబలికారు. కేసు నుంచి తప్పించాలంటే నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తండ్రి క్యాన్సర్‌ పేషెంట్‌, భార్య గర్భవతి కావడంతో బాధితుడు నగదు పంపించాడు. ఆ తర్వాత స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్