కాకతీయ యూనివర్సిటీలో చీకటి దందా

57చూసినవారు
కాకతీయ యూనివర్సిటీలో చీకటి దందా
వరంగల్ జిల్లా హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో చీకటి దందా వెలుగులోకి వచ్చింది. జవాబు పత్రాలను బయటకు తీసుకెళ్లి ఓ ముఠా పరీక్షలు రాయిస్తుంది. యూనివర్సిటీలోని ఎగ్జామ్ బ్రాంచ్ నుంచి పేపర్లు బయటకు తీసుకెళ్తూ.. విద్యార్థులతో జవాబులు రాయించి తిరిగి బ్రాంచ్ కు తీసుకొస్తున్నారు. ఇందుకు సంబంధించి సీసీ కెమెరాలో యూనివర్సిటీ కంట్రోలర్ ముగ్గురిని గుర్తించారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.