రోహిత్‌ వేముల కేసును రీఓపెన్‌ చేయాలని డీజీపీ నిర్ణయం

77చూసినవారు
రోహిత్‌ వేముల కేసును రీఓపెన్‌ చేయాలని డీజీపీ నిర్ణయం
రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాజాగా ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు విచారణను ముగిస్తున్నట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. నిందితులకు క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేసును రీఓపెన్‌ చేయాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా నిర్ణయించారు. పునర్విచారణకు అనుమతి కోరుతూ కోర్టులో తెలంగాణ పోలీస్‌ శాఖ పిటిషన్‌ దాఖలు చేయనున్నది.