భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకొనేందుకు సోమవారంతో గడువు ముగిసింది. ఎవరు దరఖాస్తు చేశారు? ఎవరివి చెల్లుబాటు అయ్యాయనే విషయాలను బీసీసీఐ వెల్లడించలేదు. ఈ రేసులో గౌతమ్ గంభీర్ ముందున్నాడనేది క్రికెట్ విశ్లేషకుల మాట. అయితే, విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ ధోనీ పేరును తెరమీదకు తెచ్చాడు. ఎంఎస్ ధోనీని ప్రధాన కోచ్గా నియమిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించాడు.