టీమిండియా మాజీ కెప్టెన్, CSK సారథి ఎంఎస్ ధోనీ ఓ అరుదైన ఘనతకు చేరువగా ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఆరుసార్లు ట్రోఫీ సాధించిన జట్టు ఇప్పటికి ఏదీ లేదు. CSK, ముంబై ఇండియన్స్ ఐదేసి సార్లు ఛాంపియన్గా నిలిచాయి. రోహిత్ నాయకత్వంలో ముంబై ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఈసారి చెన్నై గెలిస్తే కెప్టెన్గా ఆరోసారి టైటిల్ను అందుకొనే అవకాశం ధోనీ సొంతమవుతుంది.