కేంద్రం నుంచి పదవులు ఆశించలేదు: చంద్రబాబు

71చూసినవారు
కేంద్రం నుంచి పదవులు ఆశించలేదు: చంద్రబాబు
ఢిల్లీ పర్యటన గురించి చంద్రబాబు మాట్లాడుతూ ‘దక్షిణాదిలో ఏ రాష్ట్రానికీ లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయి. నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులూ ఆశించలేదు. వాజ్‌పేయీ ప్రభుత్వంలోనూ పదవులు కోరలేదు. ఏడు మంత్రి పదవులు తీసుకోవాలని వాజ్‌పేయీ చెప్పినా తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఎన్డీయే ఇచ్చిన రెండు మంత్రి పదవులతో సంతోషంగానే ఉన్నాం’ అని తెలిపారు.