రాతి చేపకు జీవం వస్తే కలియుగం అంతమవుతుందని తెలుసా..?

59చూసినవారు
రాతి చేపకు జీవం వస్తే కలియుగం అంతమవుతుందని తెలుసా..?
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఉన్న రాతి చేపకు జీవం వస్తే కలియుగం అంతమవుతుందని మీకు తెలుసా..? నందలూరు మండలంలో 11వ శతాబ్దానికి చెందిన సౌమ్యనాథస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలోని అంతర్భాగంలో పైన ఒక రాతిపై చేప ఆకారాన్ని శిల్పంగా చెక్కారు. భవిష్యత్తులో భారీ వరదలతో ఈ ఆలయం లోపలికి నీరు చేరుకుంటుందని, ఆ నీరు ఈ చేపని తాకిన వెంటనే ఆ చేపకి ప్రాణం వచ్చి నీటిలో ఈదుతుందని వేద పండితులు చెబుతున్నారు. అప్పుడు ఈ కలియుగం అంతమవుతుందని స్థల పురాణం చెపుతోందని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్