ఏపీ హైకోర్టులో విచారణకు నగ్నంగా వచ్చిన వ్యక్తి

53చూసినవారు
ఏపీ హైకోర్టులో విచారణకు నగ్నంగా వచ్చిన వ్యక్తి
ఏపీ హైకోర్టులో ఆన్‌లైన్ విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి నగ్నంగా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఈ నెల 15న జరిగింది. హైకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మంచంపై నగ్నంగా పడుకుని ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై హైకోర్టు ఐటీ రిజిస్ట్రార్ ఏడుకొండలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేేసు నమోదు చేసి.. లాగిన్ వివరాల ద్వారా అతడి గురించి ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్