శబరిమలలో భారీ రద్దీ.. భక్తుల పడిగాపులు

52చూసినవారు
శబరిమలలో భారీ రద్దీ.. భక్తుల పడిగాపులు
శబరిమలలోని అయ్యప్ప క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. అయ్యప్ప నెల దర్శనం, నక్షత్ర దర్శనాల కోసం భక్తులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుని తరలివచ్చారు. అయితే భారీ రద్దీ నెలకొనడంతో దాదాపు ఏడుగంటలు భక్తులు క్యూలైన్లలో పడిగాపులు గాస్తున్నారు. స్వామివారి దర్శనానికి అధికారులు అనుమతించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో క్యూలైన్లలోనే భక్తులు పోలీసులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్