దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఇవాళ ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్ 278 పాయింట్లు నష్టపోయి 64,980 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 19,450 వద్ద కొనసాగుతున్నాయి. ఎథేర్ మోటార్స్, BPCL, NTPC, హిందాల్కో,
అదానీ పోర్ట్స్,
అదానీ ఎంటర్ ప్రైజెస్, దివిస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ఉండగా, SBI లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్, HDFC, ONGC, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.