ఏఎన్‌యూ పరిధిలో పరీక్షలు వాయిదా

77చూసినవారు
ఏఎన్‌యూ పరిధిలో పరీక్షలు వాయిదా
ఏపీకి భారీ వర్ష సూచన నేపథ్యంలో గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఏఎన్‌యూ పరిధిలో గురువారం దూర విద్యా కేంద్రం పరీక్షలు జరుగనున్నాయి. అయితే, తుపాను నేపథ్యంలో పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్