UPSC టాపర్ల విషయంలో తప్పుడు ప్రకటన.. శంకర్ ఐఏఎస్ అకాడమీకి రూ.5లక్షల జరిమానా

75చూసినవారు
UPSC టాపర్ల విషయంలో తప్పుడు ప్రకటన.. శంకర్ ఐఏఎస్ అకాడమీకి రూ.5లక్షల జరిమానా
తమ వద్ద శిక్షణ పొందిన 336 మంది అభ్యర్థులు 2022 UPSCకి ఎంపికయ్యారని తప్పుడు ప్రకటన చేసినట్లు తేలడంతో శంకర్ ఐఏఎస్ అకాడమీకి కేంద్ర వినియోగదారుల భద్రతా సంస్థ (సీసీపీఏ) రూ.5లక్షల జరిమానా విధించింది. ఆ అకాడమీ పేర్కొన్న 336 మందిలో 221 మంది ఉచిత ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకోగా, కొందరు షార్ట్ టర్మ్ కోర్సులకు హాజరైనట్లు తేలింది. కానీ తమ వద్దే శిక్షణ పొందారని తప్పుడు ప్రకటనలు ఇచ్చినట్లు సీసీపీఏ చెప్పింది.

సంబంధిత పోస్ట్