తాగు నీటికోసం గొడవ.. మామను హత్య చేసిన కోడలు

24362చూసినవారు
తాగు నీటికోసం గొడవ.. మామను హత్య చేసిన కోడలు
హన్మకొండ జిల్లా హసన్ పర్తిలో దారుణం జరిగింది. మండల కేంద్రానికి చెందిన జల్లి సారయ్య (80) కుమారులు ఇద్దరు చనిపోవడంతో తన భార్యతో కలిసి పెద్ద కోడలు రమాదేవి ఒకే ఇంటిలో వేర్వేరుగా ఉంటున్నారు. అయితే వీరి ఇంటికి ఒకే నల్లా కనెక్షన్ ఉండడం వల్ల నల్లా వచ్చినప్పుడల్లా వీరి మధ్య గొడలు జరిగేవి. ఆదివారం కూడా నల్లా విషయంలో గొడవ జరగ్గా పెద్ద కోడలు రమాదేవి తన ఇద్దరు కొడుకులతో కలిసి సారయ్యపై దాడి చేసింది. నుదుటిపై బలంగా తగలడంతో సారయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.