ఆకస్మిక వరదలు.. బ్రిడ్జ్ కూలి 12 మంది మృతి

74చూసినవారు
ఆకస్మిక వరదలు.. బ్రిడ్జ్ కూలి 12 మంది మృతి
చైనాలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. షాంగ్లూ నగరంలోని ఝాషుయ్ కౌంటీలో హైవేపై ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. 31 మంది గల్లంతయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించడంతో వంతెన కూలిపోయిందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు హన్యున్ కౌంటీలోని గ్రామంలో 40కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయన్నారు.

సంబంధిత పోస్ట్