ఒంగోలులో జరిగిన హింసాత్మక ఘటనలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలని వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోరారు. శుక్రవారం బాలినేని మాట్లాడుతూ.. ‘అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక శుభాకాంక్షలు. హింసాత్మక ఘటనలకు తావులేదని నిన్న మీరిచ్చిన సందేశం హర్షణీయం. ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింస, భౌతిక దాడులు, వేధింపులపై మీరు స్పందించాలి.’ అని అన్నారు.