ఫీజుల ’మోత‘

60చూసినవారు
ఫీజుల ’మోత‘
ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటేటా భారంగా మారుతున్నాయి. పలు ప్రైవేట్‌ బడులు. ముఖ్యంగా కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా రుసుములను పెంచుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో కొన్ని పాఠశాలలు ఏకంగా 25శాతం వరకు ఫీజులు పెంచేశాయి. కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు 40-50 శాతం భారం మోపుతున్నాయి. ఇప్పటికే చాలా బడులు కొత్త రుసుముల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయగా. మరికొన్ని ఈ నెల 15వ తేదీ తర్వాత నిర్ణయించనున్నాయి.

సంబంధిత పోస్ట్