కవితను ములాఖత్‌లో కలిసిన మాజీ మంత్రులు (వీడియో)

50చూసినవారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆ పార్టీ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ములకాత్‌లో భాగంగా కలిశారు. రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవితను కలిసిన విషయం తెలిసిందే. కాగా ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు జులై 3 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో కవితను మార్చి 15న అధికారులు ఆమె నివాసంలో అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :