ఆ రూట్‌లో మళ్లీ ప్రారంభమైన రైళ్ల రాకపోకలు

75చూసినవారు
ఆ రూట్‌లో మళ్లీ ప్రారంభమైన రైళ్ల రాకపోకలు
పశ్చిమబెంగాల్‌లోని డార్జింగ్‌లో సోమవారం ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. దీంతో ప్రమాదం కారణంగా ఆ రూట్లలో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. తాజాగా రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. ఆ రూట్‌లో యధావిధిగా రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రమాదం అనంతరం ఫన్సిడేవా వద్ద రైల్వే ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలను సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగించారు. విద్యుత్ లైన్లను బాగుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్