కొండెక్కిన కూరగాయలు

55చూసినవారు
కొండెక్కిన కూరగాయలు
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. కేవలం నెలరోజుల వ్యవధిలోనే టమాటా మూడురెట్లు పెరగగా, మిగిలిన వాటి ధరలు 30–50 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం టమాటా కిలో రూ.65కు పైగా పలుకుతుండగా, మిర్చి ధర సెంచరీ వైపు పరుగులు తీస్తోంది. అలాగే అల్లం, వెల్లుల్లి డబుల్‌ సెంచరీ దాటాయి. ఇక అందరూ ఎక్కువగా వినియోగించే వంగ, బెండ, బీర వంటి సాధారణ కూరగాయల ధరలు సైతం బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.50కు పైగా పలుకుతుండడం ఆందోళన కల్గిస్తోంది. చివరికి ఆకుకూరల ధరలు సైతం అనూహ్యంగా పెరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్