బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వెళ్తున్న మహిళను వెనుక నుంచి చాలా దగ్గరగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమెపై హత్యాయత్నానికి సంబంధించి న్యాయవాదితో సహా నలుగురు వ్యక్తులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్లో ఈ సంఘటన జరిగింది. ఈ కాల్పుల్లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న పల్లవి శర్మ గాయపడింది.