మధ్యప్రదేశ్కు చెందిన ప్రియాల్ యాదవ్ ఇండోర్ డిప్యూటీ కలెక్టర్గా నియమితులయ్యారు. ఇటీవల విడుదలైన MPPSC ఫలితాల్లో ఆమె ఆరో ర్యాంక్ సాధించారు. రైతు బిడ్డ అయిన ఆమె తాను టెన్త్ వరకు స్కూల్ టాపర్ అని, 11వ తరగతిలో ఫిజిక్స్లో ఫెయిల్ అయ్యానని తెలిపారు. ఇప్పటివరకు లైఫ్లో అదే తన తొలి, చివరి ఫెయిల్యూర్ అని పేర్కొన్నారు. డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూనే యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతానని చెప్పారు.