బర్త్ డే పార్టీలో మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ హత్యకు దారి తీసింది. మహారాష్ట్రలోని చించాడ ప్రాంతంలో నివసించే కార్తీక్ది జూన్ 27న బర్త్ డే. ఆ రోజు తన ఫ్రెండ్స్ నీలేష్, సాగర్, ధీరజ్లకు కార్తీక్ పార్టీ ఇచ్చాడు. మద్యం విషయంలో వారికి గొడవ జరిగింది. ఆ సమయంలో నీలేష్ తలపై మద్యం బాటిల్లో కార్తీక్ కొట్టాడు. కొద్ది సేపటికి ఫ్రెండ్స్ అంతా కలిసి కార్తీక్ను 4వ అంతస్తు నుంచి కిందికి విసిరేసి చంపారు.