విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిబంధనలు మరింత సరళతరం కాబోతున్నాయి. ఎంపిక చేసిన రంగాల్లో FDI నిబంధనలు మారే అవకాశాలున్నాయని, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిన నూతన సర్కార్ ఈ నిబంధనలను మార్చే అవకాశాలున్నాయని డీపీఐఐటీ సెక్రటరీ రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు. ఏప్రిల్- డిసెంబర్ 2023 మధ్యకాలంలో కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెలికాం, ఆటో, ఫార్మా రంగాల్లో FDIలు తగ్గుముఖం పట్టాయని ఓ నివేదిక వెల్లడించింది.