పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: ఫీల్డ్ డైరెక్టర్

85చూసినవారు
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: ఫీల్డ్ డైరెక్టర్
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శివాని డోగ్ర పిలుపునిచ్చారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా దోమలపెంట రేంజ్ ఆఫీసు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణకు మహాత్ముడు కాంక్షించాడని, ప్రజలందరూ పర్యావరణ హితం కోసం కృషి చేయాలని అన్నారు.