సెల్ఫీ తీసుకున్నా జీఎస్టీ వేస్తారేమో: సీఎం స్టాలిన్

68చూసినవారు
సెల్ఫీ తీసుకున్నా జీఎస్టీ వేస్తారేమో: సీఎం స్టాలిన్
హోటల్‌లో భోజనం నుంచి టూవీలర్ రిపేర్ల దాకా అన్నింట్లో పన్ను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం పేద, మద్యతరగతి ప్రజలను దోచుకుంటోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. జీఎస్టీ పేరుతో పేదల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టాలిన్ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. భవిష్యత్తులో సెల్ఫీ తీసుకున్నా జీఎస్టీ వేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.