తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలి, భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండలు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో వరి పైరు నెలవాలే ప్రమాదం ఉంది. మరికొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు తడుస్తాయని రైతులు కల్లాల వద్దకు పరుగులు పెడుతున్నారు.