సీతంపేట ఏజెన్సీలో జ్వరాలు అధికంగా నమోదు అవుతున్నాయని, వాటిపై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టసారించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. సోమవారం సీతంపేట ఏరియా ఆసుపత్రిని ఆయన సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్రావును అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, పారిశుధ్య పనులు చేపట్టాలని తెలిపారు.