1982 మార్చిలో 'తెలుగుదేశం పార్టీ'ని ఎన్టీఆర్ ప్రకటించారు. పార్టీని పెట్టిన కేవలం 9నెలల్లోనే దశాబ్దాలుగా తెలుగు నెలపై ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్కు చెమటలు పట్టించారు. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ 201 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. మూడు పర్యాయాల్లో మొత్తం ఏడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్టీఆర్ పనిచేశారు.