ప్రకృతిని ఆరాధించే పండగే బతుకమ్మ

81చూసినవారు
దేవుళ్లను పూలతో పూజిస్తాం. పూలకే పూజచేసే ప్రకృతిని ఆరాధించే పండగే బతుకమ్మ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపడుచుల శ్రమైక జీవనం, ఆత్మగౌరవానికి ప్రతీకైన బతుకమ్మ పండగ ప్రకృతిలోని పూలతో ముడిపడి ఉందన్నారు. కేంద్రమంత్రి సతీమణి కావ్య, గాయని మంగ్లీ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :