సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లోని మంత్రులందరికీ కొత్త ల్యాండ్ క్రూయిజర్ కార్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో మంత్రికి ఒక్కో ల్యాండ్ క్రూయిజర్ను కేటాయించారు. ఈ వాహనాలకు ఆయా మంత్రులు పూజలు కూడా నిర్వహించారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి మాత్రమే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ల్యాండ్ క్రూయిజర్ కార్లను సమకూర్చేది. ఇకపై మంత్రులకు కూడా ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను సమకూర్చింది.