ఈశ్వరమ్మ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది

54చూసినవారు
కొల్లాపూర్ మం. మొలచింతలపల్లికి చెందిన చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మపై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో బాధితురాలు ఈశ్వరమ్మను, కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తలదించుకునే ఘటన ఇది అని పేర్కొన్నారు. యావత్ సమాజం తీవ్రంగా ఖండించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్