బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది: డా. లక్ష్మణ్

64చూసినవారు
గడిచిన పదేళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీయాలాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఎంపీ డా. లక్ష్మణ్ అన్నారు. శనివారం అయన మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే విధంగా కుట్రకు తెరలేపిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పూర్తీ స్థాయిలో విచారణ జరిపించాలని గవర్నర్ రాధాకృష్ణన్ ను విన్నవించడానికి రాజ్ భవన్ కు వచ్చామన్నారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాలన్నారు.