ఎయిర్ ఇండియాలోని పలువురు ఉద్యోగులు ఉన్నట్టుండి సిక్ లీవ్ పెట్టడంతో పలు ఎక్స్ప్రెస్ విమానాలు రద్దయిన విషయం తెలిసిందే. దీనిపై ఆ సంస్థ చర్యలు తీసుకుంది. 25 మందికి పైగా సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించింది. దాదాపు 100 ఫ్లైట్లు రద్దవగా, మరికొన్ని ఆలస్యమయ్యాయి. దీంతో 15 వేల మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ అసౌకర్యానికి తమను క్షమించాలని సంస్థ ప్రయాణికులను కోరింది.