దుర్గాబాయి తన 11 సంవత్సరాల ప్రాయంలో ఖాదీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఆమెను వాలంటీర్గా నియమించినపుడు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన పండిట్ నెహ్రూ ని టికెట్ లేని కారణంగా అనుమతించలేదు. తదనంతరం టికెట్ కొన్నాకే లోనికి పంపించారు. గాంధీజీ పిలుపుమేరకు పెద్దసంఖ్యలో నగదు మొత్తాన్ని, నగలను సేకరించిన దుర్గాబాయి.. ఓ బహిరంగసభలో గాంధీజీకి విరాళంగా అందజేశారు. ఆమెలోని ధైర్యసాహసాలకు, పట్టుదలకు ఇవే నిదర్శనాలు.