తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థునుల కష్టాలు...

83చూసినవారు
తాండూర్ పట్టణం లో ఇటీవలే నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ఏర్పాటు చేశారు. ఈ భవనాన్ని స్థానిక శాసనసభ్యులు అట్టహాసంగా ప్రారంభించారు. తరగతి గదుల్లో ఉండాల్సిన బెంచీలు పాత భవనంలో ఉండడంతో కళాశాల ప్రిన్సిపల్ రాజా మోహన్ రావు విద్యార్థినులే పాత భవనం నుండి నూతన భవనంలోకి తీసుకువచ్చి ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో విద్యార్థులు బెంచీలను నూతన భవనంలోకి ఇబ్బందులు పడుతూ తమ తమ తరగతి గదిలో ఏర్పాటు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్