
తార్నాక: రేపు ఓయూకు రానున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ఓయూ సైన్స్ కళాశాలకు బుధవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రానున్నారు. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, ఫిజిక్స్ విభాగం నిర్వహించనున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభింస్తారు. “ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్” అనే అంశంపై జరిగే సదస్సును ఉదయం పదిన్నర గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేసారు.