కూకట్పల్లి నియోజకవర్గంలో ఈ నెల 5వ తేదీన ఎంకెఎన్ ఆర్ గార్డెన్లో బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మంగళవారం నియోజకవర్గ ఇన్ఛార్జి మాధవరం కాంతారావు అన్నారు. మే 13వ తేదీన జరగనున్న మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందరన్ ను భారీ మెజారిటీతో గెలిపించే దిశగా ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తామన్నారు.